రాజధాని లేని రాష్ట్రం ఎన్నాళ్లు?
ABN , First Publish Date - 2022-05-16T05:35:56+05:30 IST
ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా ఎన్నాళ్లు ఉంచుతారని రైతులు ప్రశ్నించారు. న్యాయం స్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలని కోరారు.
న్యాయస్థానం తీర్పును గౌరవించండి
880వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు
తుళ్లూరు, మే 15: ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా ఎన్నాళ్లు ఉంచుతారని రైతులు ప్రశ్నించారు. న్యాయం స్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలని కోరారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు ఆదివారం 880వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు రైతు ధర్నా శిబిరాల నుంచి మాట్లాడుతూ రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రులకు ఎంతో ఖ్యాతి వచ్చేదన్నారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. పాలకులు మారినంత మాత్రాన రాజధాని మారదన్నారు. ఎప్పటికైనా అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టమైనప్పుడు అభివృద్ధి చేయటానికి సంకోచం ఎందుకని ప్రశ్నించారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి.