టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మంకు నోటీసులు
ABN , First Publish Date - 2021-01-22T14:03:41+05:30 IST
టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంకు పోలీసులు నోటీసులు అందజేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఇంటికి వచ్చిన తాడేపల్లి పోలీసులు..
అమరావతి: టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంకు పోలీసులు నోటీసులు అందజేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఇంటికి వచ్చిన తాడేపల్లి పోలీసులు.. సీఆర్పీసీ 41కింద బ్రహ్మంకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు జీవో 77పై సీఎం నివాసం ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. అయితే టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిని తాను కాదని చెప్పినా వినకుండా పోలీసులు నోటీసులు అందజేశారు. కరోనా బారిన పడిన నాదెండ్ల బ్రహ్మం చికిత్స పొంది రెండు రోజుల క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. తాను డాక్టర్ను కలవాలని చెప్పినా వినకుండా తాడేపల్లి పోలీసులు ఇప్పటికీ బ్రహ్మం ఇంట్లోనే ఉన్నారు. పోలీసుల తీరుపట్ల టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.