రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వారికి పోలీసుల బ్రేకులు

ABN , First Publish Date - 2022-09-24T15:33:16+05:30 IST

రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వారికి పోలీసులు బ్రేకులు వేసే పనిలో పడ్డారు. రైతుల పాదయాత్రకు వెళ్లే వారికి నోటీసులు అందజేస్తున్నారు.

రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వారికి పోలీసుల బ్రేకులు

అమరావతి: రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వారికి పోలీసులు బ్రేకులు వేసే పనిలో పడ్డారు. రైతుల పాదయాత్రకు వెళ్లే వారికి నోటీసులు అందజేస్తున్నారు. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంకిపాడు టోల్‌గేట్‌ దగ్గర మచిలీపట్నం మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో గద్దె అనురాధ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. మరోవైపు పోలీసుల చర్యలపై కోర్టుకు వెళ్లే యోచనలో జేఏసీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పాదయాత్రకు వస్తున్న స్పందనతో ప్రభుత్వం కావాలనే యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అమరావతి పరిరక్షణ సమితి ఆరోపించారు. 

Updated Date - 2022-09-24T15:33:16+05:30 IST