అమరావతి అంశంపై మరో వివాదాస్పద నిర్ణయం
ABN , First Publish Date - 2021-10-06T18:07:45+05:30 IST
అమరావతి అంశంపై పాఠశాల విద్యాశాఖ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
విజయవాడ: అమరావతి అంశంపై పాఠశాల విద్యాశాఖ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పదో తరగతిలో అమరావతి పాఠంను విద్యాశాఖ తొలగించింది. నూతనంగా ముద్రించిన పుస్తకాల్లో అమరావతి పాఠ్యాంశం కనిపించలేదు. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకాన్ని ముద్రించారు. సంస్కృతిక వైభవం కింద రెండో పాఠ్యాంశంగా అమరావతిని చేర్చారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే ముద్రించారు. విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందించాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వం సూచించింది.