Amarnath yatraకు వెళ్లిన ఏపీ భక్తుల భద్రతకు చర్యలు తీసుకోండి: Jagan
ABN , First Publish Date - 2022-07-09T16:30:11+05:30 IST
అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ (Jagan) ఆదేశాలు జారీ చేశారు. అమర్నాథ్ యాత్ర(Amarnath yatra)లో కుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలపై సీఎంకు అధికారులు వివరించారు. ఈ క్రమంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ భక్తుల (AP devotess) భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్కు సీఎంఓ అధికారులు ఫోన్ చేశారు.