అమరనాథ్‌ యాత్రకు ఏప్రిల్ 11 నుంచి రిజిస్ట్రేషన్

ABN , First Publish Date - 2022-04-08T16:19:48+05:30 IST

ప్రఖ్యాత అమరనాథ్ యాత్ర కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా, ఈ యేడాది యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుందని అమర్‌నాథ్‌జీ శ్రైన్ బోర్డ్ సీఈవో నితీశ్వర్ కుమార్ తెలిపారు. జూన్ 30 నుంచి ఆగస్టు 11 వరకు ఈ యాత్ర కొనసాగనున్నట్లు నితీశ్వర్ తెలిపారు. కొవిడ్-19 పాండమిక్ తర్వాత ప్రారంభం ప్రారంభం..

అమరనాథ్‌ యాత్రకు ఏప్రిల్ 11 నుంచి రిజిస్ట్రేషన్

న్యూఢిల్లీ: ప్రఖ్యాత అమరనాథ్ యాత్ర కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా, ఈ యేడాది యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుందని అమర్‌నాథ్‌జీ శ్రైన్ బోర్డ్ సీఈవో నితీశ్వర్ కుమార్ తెలిపారు. జూన్ 30 నుంచి ఆగస్టు 11 వరకు ఈ యాత్ర కొనసాగనున్నట్లు నితీశ్వర్ తెలిపారు. కొవిడ్-19 పాండమిక్ తర్వాత ప్రారంభం ప్రారంభం కానున్న ఈ యాత్రకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారట. జమ్మూలోని రాంబన్ నుంచి ప్రారంభంకానున్న ఈ యాత్రకు సుమారు మూడు లక్షల మంది భక్తులు రానున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై నితీశ్వర్ మాట్లాడుతూ ‘‘ఏప్రిల్ 11 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జమ్మూ కశ్మీర్ బ్యాంక్, పీఎన్‌బీ బ్యాంక్, యెస్ బ్యాంకులకు చెందిన సుమారు 446 బ్రాంచీల్లో, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 100 బ్రాంచీల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంది. మూడు లక్షల మంది భక్తులు ఈ యాత్రకు హాజరవుతారని అనుకుంటున్నాము’’ అని అన్నారు.

Updated Date - 2022-04-08T16:19:48+05:30 IST