టీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుత విజయాలు

ABN , First Publish Date - 2022-05-26T05:17:13+05:30 IST

టీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుత విజయాలు

టీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుత విజయాలు
కసిరెడ్డి నారాయణరెడ్డిని సత్కరిస్తున్న నాయకులు

ఆమనగల్లు, మే 25: టీఆర్‌ఎస్‌ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోఅద్భుత విజయం సాధించిందని, అన్నివర్గాల ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనా దక్షత, వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సత్పలితాలిస్తూ దేశ వ్యాప్త ప్రశంసలందుకుంటున్నాయన్నారు. ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని వివిధ మండలాలకు చెందిన నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు అశోక్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, నరేశ్‌నాయక్‌, పర్వత్‌రెడ్డి, సురేందర్‌ రెడ్డి, అల్లాజీ, మెకానిక్‌బాబా, కొండల్‌రెడ్డి, విజయ్‌ ు, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T05:17:13+05:30 IST