అక్కడ ఒక జీ‌వో‌కు అంబేడ్కర్ పేరు పెట్టారు: రాజరత్నం అంబేడ్కర్

ABN , First Publish Date - 2022-06-15T22:31:15+05:30 IST

విజయవాడ: జమైకాలో ఒక జీవోకు అంబేడ్కర్ పేరు పెట్టారని, అయితే ఏపీలో ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టవద్దని నిరసన తెలపడం బాధాకరమని అంబేద్కర్ ముని

అక్కడ ఒక జీ‌వో‌కు అంబేడ్కర్ పేరు పెట్టారు: రాజరత్నం అంబేడ్కర్

విజయవాడ:  జమైకాలో ఒక జీవోకు అంబేడ్కర్ పేరు పెట్టారని, అయితే ఏపీలో ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టవద్దని నిరసన తెలపడం బాధాకరమని అంబేద్కర్ ముని మనవడు రాజరత్నం అంబేడ్కర్ అన్నారు. అంబేద్కర్ తన  కుటుంబం కోసం ఒక్క నిమిషం కూడా గడపలేదని, కుటుంబ సభ్యులు చనిపోయినా సరే దేశ ప్రజలు కోసమే పని చేశారని గుర్తు చేశారు.  అంబేడ్కర్ పేరు ఒక జిల్లాకు పెట్టవద్దన్న వారి పుట్టుక ఏమిటో చూసుకోవాలన్నారు.  


            అప్పట్లో తాను ఏపీకి వచ్చినపుడు అప్పటి ప్రభుత్వం అరెస్టు చేయించిందని, ఆ తరువాత నా పిలుపుతో చంద్రబాబును జనం ఓడించారని గుర్తు చేశారు. దళితులు తమ ఓట్లతో  జగన్ మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారని, అంబేద్కర్ ఆశయాలని కొనసాగించాల్సిన బాధ్యత జగన్‌దేనన్నారు.  ఎన్‌టీ రామారావు , వైఎస్సార్ , సత్యసాయి జిల్లా పేర్లకు అభ్యంతరాలు లేనపుడు అంబేడ్కర్ పేరుకు మాత్రమే ఎందుకో చెప్పాలన్నారు.  అంబేద్కర్ పేరును అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-06-15T22:31:15+05:30 IST