భారత జాతిని జాగృతం చేసిన అంబేడ్కర్
ABN , First Publish Date - 2021-04-23T06:39:12+05:30 IST
రాజ్యాంగాన్ని రంచించి, భారతజాతిని జాగృతం చేసి న గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అని ప్రొఫెసర్ కాసీం, ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ కొనియాడారు.
మోటకొండూరు, ఏప్రిల్ 22: రాజ్యాంగాన్ని రంచించి, భారతజాతిని జాగృతం చేసి న గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అని ప్రొఫెసర్ కాసీం, ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ కొనియాడారు. గురువారం మోటకొం డూరు మండలం అమ్మనబోలులో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేశాడన్నారు. ఆయన చూపిన మార్గంలో నడిచి దేశాభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేష్, గ్రామ సర్పంచ్ సిరిపురం నర్మద, ఎల్లంల సంజీవరెడ్డి ఉన్నారు.