AP News: తెప్పోత్సవంపై సందిగ్ధత
ABN , First Publish Date - 2022-10-03T22:48:40+05:30 IST
Vijayawada: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతుంది. ప్రత్యేక పూజలు జరుగుతుండడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శరన్నవరాత్రోత్సవాల్లో మరో ముఖ్య ఘట్టం
Vijayawada: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు జరుగుతుండడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శరన్నవరాత్రోత్సవాల్లో మరో ముఖ్య ఘట్టం దుర్గమ్మ తెప్పోత్సవం. కృష్ణానదిలో నిర్వహించే ఈ కార్యక్రమంపై సందిగ్ధత నెలకొంది. నదికి వరద పెరగడంతో ఆలయ అధికారుల తర్జనభర్జన పడుతున్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కుల నీరు విడుదలైంది. కృష్ణా నదిలో 30 వేల క్యూసెక్కులలోపు ఇన్ఫ్లో ఉంటేనే.. తెప్పోత్సవానికి ఇరిగేషన్ శాఖ అనుమతి ఇస్తారు. సమన్వయ కమిటీ భేటీలో అధికారులు తెప్పోత్సవంపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.