జో బైడెన్ కొత్త టార్గెట్ ఇదే.. జూలై 4 నాటికి..!

ABN , First Publish Date - 2021-05-07T06:11:26+05:30 IST

వ్యాక్సినేషన్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఆ వైపుగా అమెరికా దూసుకుపోతోంది. అనుకున్న సమయం కంటే మందే విజయం సాధిస్తోంది. ఈ క్రమంలో అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తాజా

జో బైడెన్ కొత్త టార్గెట్ ఇదే.. జూలై 4 నాటికి..!

వాషింగ్టన్: వ్యాక్సినేషన్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఆ వైపుగా అమెరికా దూసుకుపోతోంది. అనుకున్న సమయం కంటే మందే విజయం సాధిస్తోంది. ఈ క్రమంలో అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు (18ఏళ్లు పైబడినవారు) వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో యువతను ఆకట్టుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలని బైడెన్ దిశానిర్దేశం చేశారు. 


Updated Date - 2021-05-07T06:11:26+05:30 IST