అమెరికా కాన్సులేట్పై దాడి
ABN , First Publish Date - 2022-03-14T13:21:00+05:30 IST
అమెరికా దౌత్యకార్యాలయం లక్ష్యంగా ఇరాక్లోకి 12 క్షిపణులు దూసుకొచ్చాయి. కుర్దిస్థాన్ ప్రాంతంలోని అర్బిల్ నగరంపై ఆదివారం తెల్లవారుజామున ఈ క్షిపణి దాడులు జరిగాయి. తూర్పు వైపు సరిహద్దు
ఇరాక్లో దూసుకొచ్చిన 12 క్షిపణులు
అర్బిల్(ఇరాక్), మార్చి 13: అమెరికా దౌత్యకార్యాలయం లక్ష్యంగా ఇరాక్లోకి 12 క్షిపణులు దూసుకొచ్చాయి. కుర్దిస్థాన్ ప్రాంతంలోని అర్బిల్ నగరంపై ఆదివారం తెల్లవారుజామున ఈ క్షిపణి దాడులు జరిగాయి. తూర్పు వైపు సరిహద్దు అవతలి నుంచి ఈ క్షిపణులు రావడంతో, పొరుగుదేశం ఇరాన్ పనేనని స్థానిక అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కచ్ఛితంగా తూర్పు వైపు నుంచే వచ్చాయని కుర్దిస్థాన్ ఉగ్రవాద నిరోధక దళం తెలిపింది. ఇరాక్లో రాకెట్, డ్రోన్ దాడులు తమ లక్ష్యంగానే జరుగుతున్నాయని తరచుగా అమెరికా ఆరోపిస్తోంది. ఇరాక్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. మిగిలిన దళాలను కూడా ఉపసంహరించాలని ఇరాన్ అనుకూల గ్రూప్లు డిమాండ్ చేస్తున్నాయి.