'ఆటా' వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ కమిటీల సమావేశం

ABN , First Publish Date - 2021-10-29T22:42:24+05:30 IST

అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో 2022 జులైలో వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్న 17వ కాన్ఫరెన్స్ కమిటీ ఫ్రారంభ సమావేశం వర్జీనియా రాష్ట్రంలో అక్టోబర్ 23న నిర్వహించారు.

'ఆటా' వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ కమిటీల సమావేశం

వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో 2022 జులైలో వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్న 17వ కాన్ఫరెన్స్ కమిటీ ఫ్రారంభ సమావేశం వర్జీనియా రాష్ట్రంలో అక్టోబర్ 23న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆటా కాన్ఫరెన్స్ బృందం 2022 జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ అంగరంగ వైభవంగా నిర్వహించడం కోసం 200 మంది వాలంటీర్లతో 80 కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ సమావేశాన్ని ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్ జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశ్య, కాన్ఫరెన్స్ డైరెక్టర్ కేకే రెడ్డి, కో-కన్వీనర్ సాయి సుదిని, కో-ఆర్డినేటర్ రవి చల్లా, కో-డైరెక్టర్ రవి బొజ్జా, స్థానిక కోఆర్డినేటర్ శ్రావణ్ పాడూరు నిర్వహించారు.


ఈ కమిటీ ఫ్రారంభ సమావేశానికి ఆటా బోర్డు సభ్యులు రవి గూడురు(న్యూజెర్సి), శరత్ వేముల(చికాగో నగరం), సీనియర్ ఆటా సభ్యులు చల్మ బండారు, మహేందర్ ముస్కుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం(CATS) అధ్యక్షురాలు సుధ కొండపు కూడా పాల్గొన్నారు. వచ్చే జూలైలో జరగనున్న ఈ 17వ ఆటా మహోత్సవ వేడుకలకు రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం(CATS) సహ ఆతిథ్య సంస్థగా వ్యవహరించడం పట్ల సుధ హర్షం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్ కమిటీ కోఆర్డినేషన్ టీమ్ సభ్యులు హనిమి వేమిరెడ్డి, ప్రవీణ్ దాసరి, కౌశిక్ సామ, రవి చల్లా, హర్ష బారెంకబాయి, లోహిత్ రెడ్ది మాట్లాడుతూ అందరి సహకారంతో 17వ ఆటా మహోత్సవ వేడుకలు ఎంతో అధ్బుతంగా జరుపుకోబోతున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-29T22:42:24+05:30 IST