Amit Shah: నేడు నగరానికి అమిత్షా రాక
ABN , First Publish Date - 2022-08-03T18:25:52+05:30 IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా(Amit Shah) రాజధాని బెంగళూరు నగరానికి బుధవారం రాత్రి రానున్నారు. హెచ్ఏఎల్ వీఐపీ
బెంగళూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా(Amit Shah) రాజధాని బెంగళూరు నగరానికి బుధవారం రాత్రి రానున్నారు. హెచ్ఏఎల్ వీఐపీ విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) స్వాగతం పలకనున్నారు. సీఐఐఏ సాంస్కృతిక విభాగాన్ని ఈనెల 4న అమిత్షా ప్రారంభిస్తారని సీఎం మీడియాకు వెల్లడించారు. బీజేపీ యువనేత ప్రవీణ్ దారుణ హత్య అనంతరం కోస్తా జిల్లాల్లో బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో ఆక్రోశం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమిత్షా రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేకించి కోస్తా తీ రంలో హింసాకాండకు ఊతమిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్డీపీఐ, పీఎఫ్ఐ తదితర సంస్థలపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభత్వం(State Govt) గత కొద్దికాలంగా కేంద్ర హోంశాఖను కోరుతున్న సంగతి విదితమే. ఎన్ఐఏ శాఖను బెంగళూరు లేదా మంగళూరులలో ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. బెంగళూరు పర్యటన సందర్భంగా అమిత్షా ఈ రెండు అంశాల విషయంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.