అమిత్షా దెబ్బకు దిగొచ్చిన ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలు
ABN , First Publish Date - 2021-11-16T22:01:12+05:30 IST
కేంద్ర హోంమంత్రి అమిత్షా దెబ్బకు బీజేపీ రాష్ట్ర నేతలు దిగొచ్చారు. రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ సిద్ధమైంది.
అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్షా దెబ్బకు బీజేపీ రాష్ట్ర నేతలు దిగొచ్చారు. రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ సిద్ధమైంది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ ప్రకటన చేసింది. అవసరమైన సందర్భాలలో యాత్రలో పాల్గొంటామని బీజేపీ కీలక నేతలు ప్రకటించారు. రాష్ట్ర పార్టీ నేతల వ్యవహార శైలిపై నిన్న తిరుపతిలో అమిత్ షా క్లాస్ తీసుకున్నారు. రైతుల మహా పాదయాత్రలో ఎందుకు పాల్గొనలేదని అమిత్షా నిలదీసినట్లు సమాచారం.