TS News: రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో అమిత్ షా మాట్లాడలేదు: పొన్నాల

ABN , First Publish Date - 2022-08-22T22:10:54+05:30 IST

Hyderabad: కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలపై మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ప్రజలను రెచ్చగొట్టడంలో బీజేపీ ముందుంటుందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఏం

TS News:  రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో అమిత్ షా మాట్లాడలేదు: పొన్నాల

Hyderabad: కేంద్ర మంత్రి అమిత్ షా (Amit sha) మునుగోడు (Munugodu) బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలపై మాజీ పీసీసీ అధ్యక్షుడు  పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) స్పందించారు. ప్రజలను రెచ్చగొట్టడంలో బీజేపీ ముందుంటుందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందన్న దానిపై అమిత్‌షా మాట్లాడలేదన్నారు. రాజకీయ మీటింగ్‌లకు జనం ఎలా వస్తారో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ అవినీతి పరుడని బీజేపీ చెబుతున్నప్పడు ఆయనపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-22T22:10:54+05:30 IST