రానున్న 30-40 ఏళ్ళు బీజేపీ శకం : అమిత్ షా

ABN , First Publish Date - 2022-07-03T21:12:04+05:30 IST

రానున్న 30 నుంచి 40 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ (BJP) శకమేనని, భారత

రానున్న 30-40 ఏళ్ళు బీజేపీ శకం : అమిత్ షా

హైదరాబాద్ : రానున్న 30 నుంచి 40 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ (BJP) శకమేనని, భారత దేశం విశ్వ గురువుగా ఎదుగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. కుటుంబ, వంశపారంపర్య రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు మహా పాపాలని తెలిపారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. 


అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ తెలిపిన వివరాల ప్రకారం అమిత్ షా ఏమన్నారంటే, బీజేపీ అనుసరిస్తున్న అభివృద్ధి రాజకీయాలు, పనితీరుకు ప్రజామోదం ఉంది. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో లభిస్తున్న విజయాలే దీనికి నిదర్శనం. కుటుంబ పాలన, కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలకాలి. తెలంగాణా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కుటుంబ పాలనకు బీజేపీ తెర దించుతుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలలో కూడా అధికారంలోకి వస్తుంది. 


బీజేపీ తదుపరి ఎదుగుదల దక్షిణాది నుంచి కనిపిస్తుందని ఈ సమావేశం సమష్టిగా ఆశాభావం వ్యక్తం చేసిందని, అటువంటి అవకాశాలు ఉన్నట్లు గుర్తించిందని  హిమంత బిశ్వ శర్మ చెప్పారు. 


Updated Date - 2022-07-03T21:12:04+05:30 IST