తమిళనాడు ఎన్నికల ప్రచారంలో షా సెటైర్లు

ABN , First Publish Date - 2021-03-01T02:13:32+05:30 IST

విల్లుపురం: తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్-డీఎంకే కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో షా సెటైర్లు

విల్లుపురం: తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్-డీఎంకే కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పాలన కుంభకోణాలతో నిండిపోయిందన్నారు. 2జి, 3జీ, 4జీలకు కొత్త అర్థాలు చెప్పారు. కాంగ్రెస్-డీఎంకే కూటమి 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందంటూ 2జి, 3జీ, 4జీల ప్రస్తావన చేశారు. 2జీ అంటే మారన్‌ కుటుంబంలోని రెండు తరాలని, 3జీ అంటే కరుణానిధికి సంబంధించిన మూడు తరాలని, 4జీ అంటే నెహ్రూ కుటుంబంలోని నాలుగు తరాలని చెప్పారు. ఓ పక్క పేద ప్రజల సంక్షేమం కోసం అన్నాడిఎంకే, బీజేపీ కూటమి తాపత్రాయపడుతుంటే రాహుల్‌ను ప్రధాని చేయాలని సోనియా, ఉదయనిధిని సీఎం చేయాలనేది స్టాలిన్ ఆందోళన పడుతున్నారని షా సెటైర్ వేశారు.  


తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్ ఆరున ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే రెండున ఫలితాలు వెలువడనున్నాయి. 

Updated Date - 2021-03-01T02:13:32+05:30 IST