14న హైదరాబాద్కుAmit Shah
ABN , First Publish Date - 2022-05-12T22:26:32+05:30 IST
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Amit Shah) శనివారం హైదరాబాద్కు రానున్నారు. ఎల్లుండి మద్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Amit Shah) శనివారం హైదరాబాద్కు రానున్నారు. ఎల్లుండి మద్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు అమిత్ చేరుకుంటారు. అక్కడి నుంచి రామంతాపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీని సందర్శించనున్నారు. తుక్కుగూడలో రెండోవిడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించనున్నారు. సాయత్రం 6 గంటలకు ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో అమిత్షా పాల్గొననున్నారు. ఎల్లుండి రాత్రి 8.20 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad Airport) నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.