అమ్మవారి ఒడి బియ్యం తూకం

ABN , First Publish Date - 2021-10-24T06:48:20+05:30 IST

బాసర సరస్వతి అమ్మవారికి భక్తులు కానుకగా సమర్పించి ఒడిబియ్యాన్ని అధికారులు శనివారం తూకం వేసి లెక్కించారు.

అమ్మవారి ఒడి బియ్యం తూకం
ఒడి బియ్యంలో వస్తువులను వేరుచేస్తున్న ఆలయ సిబ్బంది

బాసర, అక్టోబరు, 23 : బాసర సరస్వతి అమ్మవారికి భక్తులు కానుకగా సమర్పించి ఒడిబియ్యాన్ని అధికారులు శనివారం తూకం వేసి లెక్కించారు. ముందుగా ఒడిబియ్యంలోని బియ్యం, కుడుకలు, పసుపుకొమ్ములు వంటివి వేరు చేశారు. అనంతరం తూకం చేసి లెక్కించారు. బియ్యం 28.50 క్వింటా ళ్లు, ఎండుకొబ్బరి 134 కిలోలు, బరడిపోకలు 13 కిలులు, పసుపుకొమ్ములు 42 కిలోలు, బదాంలు 8 కిలోలు, ఖర్జూరపండ్లు 26 కిలోలు వచ్చినట్లు చెప్పారు. 


Updated Date - 2021-10-24T06:48:20+05:30 IST