అమ్మకు అపురూపం
ABN , First Publish Date - 2021-05-09T06:38:01+05:30 IST
మండలంలోని భూపతిపల్లికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి దండే త్రినాథ్ తన చిత్ర ప్రతిభను చాటారు. మదర్స్ డేని పురస్కరించుకొని మామిడి ఆకుపై అమ్మ బొమ్మను చిత్రీకరించారు.
ఔరా అనిపించిన
మామిడి ఆకుపై చిత్రం
మార్కాపురం (వన్టౌన్) మే 8: మండలంలోని భూపతిపల్లికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి దండే త్రినాథ్ తన చిత్ర ప్రతిభను చాటారు. మదర్స్ డేని పురస్కరించుకొని మామిడి ఆకుపై అమ్మ బొమ్మను చిత్రీకరించారు. గతం లో కూడా త్రినాథ్ చాక్పీ్సపై, కీరదోసపై వివిధ చిత్రా లను వేసి ఔరా అనిపించారు.