అమ్మఒడి నగదుకు బదులు లాప్టాప్లు
ABN , First Publish Date - 2021-04-21T13:37:25+05:30 IST
ప్రస్తుత విద్యాసంవత్సరంలో 8 నుంచి 11వ తరగతి చదివే..
గుంటూరు: ప్రస్తుత విద్యాసంవత్సరంలో 8 నుంచి 11వ తరగతి చదివే విద్యార్థులకు వచ్చే ఏడాది అమ్మఒడి పథకంలోనగదుకు బదులు లాప్టాప్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని డీఈవో ఆర్ఎస్ గంగాభవాని తెలిపారు. దీనికి సంబంధించి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించాలని సూచించారు. ఎంఈవోలు తమ పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఇంట ర్ కళాశాలల నుంచి వివరాలు సేకరించాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నిర్మాణా త్మక మూల్యాంకన మార్కులు స్టూడెంట్ ఇన్ఫొ వెబ్సైట్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. నాడు నేడు పాఠశాలల పెండింగ్ పనులు ఈనెల 30లోగా పూర్తిచేయాలని సూచించారు.