‘అమ్మఒడి నిలుపుదల అన్యాయం’
ABN , First Publish Date - 2021-10-27T05:20:14+05:30 IST
ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమ్మఒడిని నిలిపివేయడం అన్యాయమని టీడీపీ నాయకుడు పస్పీల్ మున్నా పేర్కొన్నారు.
ఆత్మకూరు, అక్టోబరు 26: ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమ్మఒడిని నిలిపివేయడం అన్యాయమని టీడీపీ నాయకుడు పస్పీల్ మున్నా పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎంఈవో జానకీరామ్కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడిని ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అమ్మఒడి సాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.