రాజధాని గ్రామాల్లో ఆగిన మరో రైతు గుండె

ABN , First Publish Date - 2020-10-25T19:07:35+05:30 IST

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ గత 311 రోజులుగా రైతులు

రాజధాని గ్రామాల్లో ఆగిన మరో రైతు గుండె

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ గత 311 రోజులుగా రైతులు, కూలీలు, మహిళలు దీక్షలు చేపట్టిన విషయం విదితమే. అయితే ఈ రైతులకు పోటీగా మూడు రాజధానులకు మద్దతిస్తూ కొందరు రైతులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ శిబిరాలు ఏర్పాటు చేసి కొందరు నేతలు హడావుడి చేస్తున్నారు. దీంతో అల్లర్లు చెలరేగే పరిస్థితులు మెండుగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో పలువురు రైతులు తుదిశ్వాస విడిచారు. తాజాగా మరో రైతు గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


ఆగిన మరో రైతు గుండె..

పూర్తి వివరాల్లోకెళితే.. 


నీరుకొండ గ్రామానికి చెందిన మాదల రామారావు అనే రైతు గుండె పోటుతో మృతి చెందారు. 

రాజధాని నిర్మాణానికి తనకున్న 90 సెంట్ల భూమిని ఇచ్చారు. అంతేకాకుండా

 

ప్రతి రోజు అందరి రైతుల లాగే రాజధాని కోసం జరిగే ఆందోళనలో పాల్గొనేవారని గ్రామస్తులు చెబుతున్నారు. 


రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో ఇవాళ రైతు గుండె పోటుతో మృతి చెందారని స్థానికులు, తోటి రైతులు మీడియాకు తెలిపారు. రామారావు మరణంతో నీరుకొండలో విషాదఛాయులు అలుముకున్నాయి. ఆయన కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదే నీరుకొండ ప్రాంతానికి చెందిన రైతు వెంకటేశ్వరరావు కొద్దిరోజుల క్రితం మరణించారు.

Updated Date - 2020-10-25T19:07:35+05:30 IST