అమూల్ పాలధర లీటరుకు రూ.2 పెంపు

ABN , First Publish Date - 2022-03-01T00:13:02+05:30 IST

అమూల్ పాల ధర రూ.2 రూపాయలు పెరిగింది. 'అమూల్' బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే..

అమూల్ పాలధర లీటరుకు రూ.2 పెంపు

న్యూఢిల్లీ: అమూల్ పాల ధర రూ.2 రూపాయలు పెరిగింది. 'అమూల్'  బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) సోమవారంనాడు ధరల నిర్ణయాన్ని ప్రకటించింది. పెంచిన పాల ధర దేశవ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పెంచిన ధరలతో గుజరాత్‌లోని అహ్మదాబాద్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో 500 ఎంఎల్ పాల ధర రూ.30, అమూల్ తాజా ధర రూ.24, అమూల్ శక్తి ధర రూ .27 కానుంది. రూ.2 పెంపుతో అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా, ముంబై మెట్రో మార్కెట్లలో ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు రూ.60కి పెరుగుతుంది. లీటర్ టోన్డ్ మిల్క్ అహ్మదాబాద్‌లో రూ.48కి, ఢిల్లీ, ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతాలో రూ.50కి చేరుతుంది. అమూల్ చివరిసారిగా గత ఏడాది జూలైలో ధరలు పెంచింది. ప్యాకింగ్, లాజిస్టిక్స్, పశువుల దాణా ఖర్చు పెరగడం వంటి కారణాలతో తాజాగా ధరలు పెంచాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2022-03-01T00:13:02+05:30 IST