ఘనంగా అమృతలత-అపురూప అవార్డుల ప్రదానోత్సవం

ABN , First Publish Date - 2021-07-26T06:41:13+05:30 IST

అమృతలత-అపురూప

ఘనంగా అమృతలత-అపురూప అవార్డుల ప్రదానోత్సవం
పురస్కారగ్రహీతలతో అతిథులు

రవీంద్రభారతి: ఆయా రంగాల్లో నిష్ణాతులైన మహిళామూర్తుల్ని ఎంపిక చేసి పురస్కారాలతో సత్కరించడం అభినందనీయమని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో అమృతలత-అపురూప 2020-21 అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.  ఎమ్మెల్సీ సురభి వాణీదేవి డా.ముక్తేవి భారతి, బలభద్రపాత్రుని రమణి, దరూరి సులోచన, అరుణభిక్షు, అయ్యగారి వసంతలక్ష్మి, శశిరెడ్డి, శ్రీనగి, రేణుక అయోల, కందేపి రాణీప్రసాద్‌, విమలక్క, కుప్పలి పద్మ, త్రివేణి, రామా చంద్రమౌళి(కవిత్వం), విహారి(కావ్యరచన)లకు ఈ అవార్డులతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, అమృతలతతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

్చ

Updated Date - 2021-07-26T06:41:13+05:30 IST