మండల కేంద్ర ఏర్పాటుకు చొరవ చూపాలి

ABN , First Publish Date - 2022-10-01T05:24:58+05:30 IST

రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మాల్‌ గ్రామాన్ని

మండల కేంద్ర  ఏర్పాటుకు చొరవ చూపాలి
వినతిపత్రం అందజేస్తున్న మాల్‌ పట్టణవాసులు

యాచారం, సెప్టెంబరు 30: రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మాల్‌ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవాలని మాడ్గుల మండల కేంద్రం వచ్చిన ఆర్‌.కృష్ణయ్యను రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన  బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి. శ్రీ శైలంతో పాటు పలువురు నాయకులు కోరారు. ఈసందర్భంగా స్పందించిన ఆర్‌.కృష్ణయ్య.. మండల కేంద్రం ఏర్పాటుకు చొరవచూపుతానని, ఈ విషయంపై త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించనున్నట్లు చెప్పారు. శుక్రవారం మాడ్గుల మండల కేంద్రం వచ్చిన ఆర్‌.కృష్ణయ్యను రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన  బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.శ్రీశైలంతోపాటు పలువురు నాయకులు ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. మాల్‌ మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే జనాలకు ఎంతో మేలు కలుగుతుందని వారు కృష్ణయ్యకు సూచించగా ఆయన పై విధంగా స్పందించారు. ఉద్యమాలు చేసి సాధించుకోవాలన్నారు. 



Updated Date - 2022-10-01T05:24:58+05:30 IST