బస్సు నుంచి జారిపడి గాయాల పాలైన మహిళ

ABN , First Publish Date - 2021-11-29T05:17:18+05:30 IST

ఆర్టీసీ బస్సు నుంచి జారి పడి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.

బస్సు నుంచి జారిపడి గాయాల పాలైన మహిళ

 బొబ్బిలిరూరల్‌, నవంబరు 28: ఆర్టీసీ బస్సు నుంచి జారి పడి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ అందించిన సమాచారం ఇలా ఉంది. సాలూరు మండలం పురోహితునివలస గ్రామానికి చెందిన నైదాన సింహాచలమమ్మ తన భర్త సింహాచలంతో కలిసి బొబ్బిలి మండలం ఎం.బూర్జివ లస గ్రామంలోగల తమ కుమార్తె ఇంటికి వెళ్లేందుకు ఆదివారం  బయలుదేరారు. సాలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వస్తున్న దంపతులు.. స్థానిక గ్రోత్‌ సెంటరులో బస్సు దిగే ప్రయత్నం చేశారు. భర్త కిందకు దిగిపోగా, వెంటనే బస్సు కదిలిపోవడంతో సింహాచలమమ్మ బస్సులో నుంచి జారిపడిపోయింది. ఆమె రెండు కాళ్లపై నుంచి బస్సు చక్రాలు వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడింది. సమాచారం తెలిసిన వెంటనే ట్రాఫిక్‌ ఎస్‌ఐ నాయుడు ఘటనాస్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో గాయపడ్డ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు ఆమెను విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జయిపోవడంతో చూసిన వారంతా కలత చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Updated Date - 2021-11-29T05:17:18+05:30 IST