రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-03-01T04:39:58+05:30 IST

కారులో వెళ్తున్న వారు బైక్‌ను తప్పించబోయి మండల పరిధిలోని విఠలాపురం స్టేజీ వద్ద ఓ చెట్టుకు ఢీకొట్టడంతో శివపార్వతి (60) వృద్ధురాలు మృతిచెందింది.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

దామరగిద్ద, పిబ్రవరి 28 : కారులో వెళ్తున్న వారు బైక్‌ను తప్పించబోయి మండల పరిధిలోని విఠలాపురం స్టేజీ వద్ద ఓ చెట్టుకు ఢీకొట్టడంతో శివపార్వతి (60) వృద్ధురాలు మృతిచెందింది. కారులోని డ్రైవర్‌ మలన్నగౌడ్‌, కృష్ణ ప్రసాద్‌, అనూషలకు స్వల్ప గాయాలవగా చికిత్స నిమిత్తం హైద రాబాద్‌ తరలించినట్లు ఎస్‌ఐ గోవర్దన్‌ తెలిపారు. హైదరాబా ద్‌కు చెందిన వీరు కర్ణాటక రాష్ట్రం యాద్గీర్‌కు బంఽధువుల ఇంటికి పలకరింపు కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘట న జరిగిందని తెలిపారు. మృతురాలి అల్లుడు చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇసుక తరలిస్తున్న వాహనాల సీజ్‌

కృష్ణ/ మక్తల్‌ రూరల్‌/ మరికల్‌, ఫిబ్రవరి 28 : మండల పరిధిలోని ముడుమాల్‌ గ్రామ శివారులో కృష్ణానది నుంచి ఆసుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను టాస్క్‌ఫో ర్స్‌ అధికారులు శనివారం అర్ధరాత్రి పట్టుకున్నారు. జాతీయ రహదారిపై దాడులు చేసి పట్టుకుని పోలీసులకు అప్పజె ప్పారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ మురళీ అ న్నారు. మక్తల్‌ పోలీస్‌ స్టే షన్‌ పరిధిలో రెండు ఇసుక ట్రాక్ట ర్లు పట్టుబడ్డాయి. మరికల్‌ మండల పరిధిలోని చిత్తనూర్‌ వాగు నుంచి తెల్లవారు జామున అక్రమంగా ఇసుకను తరలి స్తుండగా  దాడులు జరపగా ఐదు ట్రాక్టర్లను అదుపులోనికి తీసుకొని డ్రైవర్లపై కేసు నమోదు చేశామన ఎస్‌ఐ నాసర్‌ తెలిపారు. సోమ వారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

Updated Date - 2021-03-01T04:39:58+05:30 IST