రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2021-11-29T05:16:04+05:30 IST

జీగిరాం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో పాచిపెంటకు చెందిన రవ్వా కళావతి (65) మృతిచెందినట్టు సాలూరు రూరల్‌ ఎస్‌ఐ జగదీష్‌ నాయుడు ఆదివారం తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

సాలూరు రూరల్‌: జీగిరాం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో పాచిపెంటకు చెందిన రవ్వా కళావతి (65) మృతిచెందినట్టు సాలూరు రూరల్‌ ఎస్‌ఐ జగదీష్‌ నాయుడు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాచిపెంటకు చెందిన రవ్వా కళావతి తన కొడుకు వెంకటేష్‌   బైక్‌పై శనివారం రాత్రి పది గంటల సమయంలో సాలూరు వస్తున్నారు. జీగిరాం వద్ద వారి బైక్‌ను ఆటో ఢీకొనడంతో ఆమె అక్కడక్కడే మృతిచెందింది. వెంకటేష్‌కు స్వల్ప గాయాల య్యాయి. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

 

Updated Date - 2021-11-29T05:16:04+05:30 IST