నిజాంసాగర్ ప్రాజెక్టులో గుర్తు తెలియని శవం లభ్యం
ABN , First Publish Date - 2021-04-23T05:15:25+05:30 IST
నిజాంసాగర్ ప్రాజెక్టులోని ఛత్రీనౌక బంగ్లా వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైంది.
నిజాంసాగర్, జనవరి 22: నిజాంసాగర్ ప్రాజెక్టులోని ఛత్రీనౌక బంగ్లా వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైంది. మూడు రోజుల క్రితం కొందరు యువకులు స్నానం చే యడానికి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతు డు గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నట్లు ఎస్సై అహ్మద్ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.