చేవెళ్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-06-20T05:47:12+05:30 IST

చేవెళ్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

చేవెళ్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

చేవెళ్ల : గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. చేవెళ్ల సీఐ. విజయ్‌భాస్కర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండల కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న చెట్టుకింద గుర్తుతెలియని వ్యక్తి(35) మృతిచెంది ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమచారం అందించగా, సీఐ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అతడి ఆచూకీ కోసం ప్రయత్నించగా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన సమాచారం కోసం 9440627356ను సంప్రదించాలని సీఐ సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-06-20T05:47:12+05:30 IST