ఉర్దూ పాఠశాలను ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-10-28T04:10:43+05:30 IST
గిద్దలూరు పట్టణంలో ఉర్దూ పాఠశాలను ఏర్పాటు చే యాలని ముస్లిం మైనారిటీ నాయకులు పట్టణానికి వచ్చిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్అహమ్మద్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
గిద్దలూరు, అక్టోబరు 27 : గిద్దలూరు పట్టణంలో ఉర్దూ పాఠశాలను ఏర్పాటు చే యాలని ముస్లిం మైనారిటీ నాయకులు పట్టణానికి వచ్చిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్అహమ్మద్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గిద్దలూరులో ఉర్దూ పాఠశాలతోపాటు ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు సెకండ్ లాంగ్వేజీగా ఉర్దూ సబ్జెక్టును అం దించే ఏర్పాటు చేయాలని కోరారు. చైర్మన్ను కలిసిన వారిలో ఖాజాహుస్సేన్, అబ్దుల్రెహమాన్, నాయబ్రసూల్, డాక్టర్ రఫి, వెంకటసుబ్బయ్య, వినీత్ పాల్గొన్నారు.