యువకుడి ఆలోచనకు ఆనంద్ మహేంద్ర ఫిదా.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2022-06-03T16:47:14+05:30 IST
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర ఓ యువకుడు చేసిన పనికి ఫిదా అయ్యారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర ఓ యువకుడు చేసిన పనికి ఫిదా అయ్యారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Anand Mahindra సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన దృష్టికి వచ్చిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఓ యువకుడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రజలు క్రమంగా తమ సృజనాత్మక ఆలోచనలకు పదును పెడుతూ.. కొత్త కొత్త పరికరాలు ఆవిష్కరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఆనంద్ మహేంద్ర పోస్ట్ చేసిన వీడియోలో.. ఓ యువకుడు ప్లాస్టిక్ పైపులు, దారం, ప్లాస్టిక్ డబ్బాను ఉపయోగించి చెట్టుకున్న కాయలు తెంపే ఆసక్తికరమైన పరికరాన్ని తయారు చేయడాన్ని మనం చూడొచ్చు. ప్లాస్టిక్ డబ్బాను వెనక భాగంలో కట్ చేసి, దానికి క్రమ పద్ధతిలో తాడును భిగించి.. పైపుల సహాయంతో ఈజీగా జామ కాయలు తెప్పే దృశ్యాలు మనకు వీడియోలో కనిపిస్తాయి.