Twitterలో ఆనంద్ మహీంద్ర పోస్ట్.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో.. వర్షాకాలంలో ఇది ఫాలో అయితే బెటరేమో అంటూ కామెంట్స్!

ABN , First Publish Date - 2022-07-09T17:43:32+05:30 IST

ఆనంద్ మహీంద్ర.. పరిచయం అక్కర్లేని పేరు. బిజినెస్‌లో తనదైన స్టైల్‌లో రాణించి.. ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. వ్యాపారవేత్త అయినంత మాత్రాన.. అందరిలా ఈయన కూడా 24 గంటలూ బిజినెస్‌కు

Twitterలో ఆనంద్ మహీంద్ర పోస్ట్.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో.. వర్షాకాలంలో ఇది ఫాలో అయితే బెటరేమో అంటూ కామెంట్స్!

ఇంటర్నెట్ డెస్క్: ఆనంద్ మహీంద్ర.. పరిచయం అక్కర్లేని పేరు. బిజినెస్‌లో తనదైన స్టైల్‌లో రాణించి.. ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. వ్యాపారవేత్త అయినంత మాత్రాన.. అందరిలా ఈయన కూడా 24 గంటలూ బిజినెస్‌కు సంబంధించిన అంశాల గురించే అలోచించరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. సామాజిక అంశాలపై స్పందిస్తారు. తన మనసుకు నచ్చిన, తనను మెప్పించిన వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ ప్రజలకు చేరువయ్యారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాగా.. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..



దేశ వ్యాప్తంగా వర్షాలు కురిస్తున్నాయి. వర్షాలు వల్ల మనకు మేలు కలిగినా.. ఎడతెరిపిగా కురిస్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా రోడ్లపై నీళ్లు నిలిస్తే ఆ తిప్పలు మామూలుగా ఉండవు. అయితే.. ఆ సమస్యలకు ఓ కుర్రాడు తనదైన స్టైల్‌లో చెక్ పెట్టాడు. ఒక్క చుక్క నీళ్లు కూడా తన కాళ్లకు తగలకుండా.. ఎంచక్కా రోడ్డుపై తిరుగేస్తున్నాడు. ఒకే రకమైన రెండు ప్లాస్టిక్ కుర్చీలకు తాళ్లు కట్టి.. చెరువును తలపించే రోడ్డుపై వాటిని తన దారిలో వేసుకుంటూ హ్యాపీగా తిరిగేశాడు. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా ఆనంద్ మహీంద్ర కంట పడింది. దీంతో ఆ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ‘ఆవిష్కరణలకు అవసరాలే మూలం’ అంటూ ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. వర్షాకాలం దీన్నే ఫాలో అయితే బెటరేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-07-09T17:43:32+05:30 IST