సంతకం పెట్టడం ఇష్టం లేకపోతే..తిరుమల వెళ్లడం దేనికి?: ఆనందబాబు

ABN , First Publish Date - 2020-09-23T18:24:30+05:30 IST

నిరాధార ఆరోపణలతో తెలుగుదేశం పార్టీపై బురదజల్లేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారని...

సంతకం పెట్టడం ఇష్టం లేకపోతే..తిరుమల వెళ్లడం దేనికి?: ఆనందబాబు

అమరావతి: నిరాధార ఆరోపణలతో తెలుగుదేశం పార్టీపై బురదజల్లేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, సంతకం పెట్టడం ఇష్టం లేకపోతే.. అసలు తిరుమల వెళ్లడం దేనికని ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్, మనీల్యాండరింగ్, క్విడ్ ప్రోకో పదాలను.. ప్రజలకు పరిచయం చేసింది జగన్, విజయసాయిరెడ్డేనని ఆయన అన్నారు.


రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత భూములు కొంటే.. అది తప్పెలా అవుతుందని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలయినప్పుడు లోకేష్ మంత్రిగానే లేరన్నారు. అలాంటప్పుడు రూ.2 వేలకోట్ల అవినీతి ఎలా చేశారని ప్రశ్నించారు. నూటికి 80 శాతం మంది దళితులు వైసీపీకి ఓటేస్తే.. ప్రభుత్వం వారికి హత్యలు, దాడులు, శిరోముండనాలను కానుకగా ఇచ్చిందని నక్కా ఆనందబాబు విమర్శించారు.

Updated Date - 2020-09-23T18:24:30+05:30 IST