chandrababu కుటుంబసభ్యుల్ని అక్రమ కేసుల్లో ఇరికించాలని ప్రభుత్వం చూస్తోంది: ఆనంద్ బాబు

ABN , First Publish Date - 2022-05-11T21:44:54+05:30 IST

TDP పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

chandrababu కుటుంబసభ్యుల్ని అక్రమ కేసుల్లో ఇరికించాలని ప్రభుత్వం చూస్తోంది: ఆనంద్ బాబు

అమరావతి: TDP పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు (Anandbabu) వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేతకానితనంతో చంద్రబాబు కుటుంబసభ్యుల్ని కూడా అక్రమ కేసుల్లో ఇరికించి సునకానందం పొందాలనుకుంటోందని విమర్శించారు. ఇప్పటికే నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషించి ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారన్నారు. ఇప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణిలను అక్రమ కేసులో ఇరికించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ ఫుడ్స్‌ని చేర్చారని మండిపడ్డారు. మంగళగిరిలో తరచూ పర్యటిస్తున్న లోకేష్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి తట్టుకేలేక ఎమ్మెల్యే ఆర్కే చంద్రబాబు కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. గతంలో రాజధానిలో అక్రమాలంటూ కొండని తవ్వి ఎలుక తోక కూడా పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా మరోసారి ప్రజావ్యతిరేకత ఎదుర్కోవటం తప్ప ఏం చేయలేరని ఆనందబాబు వ్యాఖ్యానించారు.

Read more