పదవ తరగతి విద్యార్థిపై హత్యాయత్నం కేసు...తల్లిదండ్రుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-04-23T19:28:21+05:30 IST

జిల్లాలోని పుట్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో పదవ తరగతి విద్యార్థిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది.

పదవ తరగతి విద్యార్థిపై హత్యాయత్నం కేసు...తల్లిదండ్రుల ఆగ్రహం

అనంతపురం: జిల్లాలోని పుట్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో పదవ తరగతి విద్యార్థిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. మూడు రోజుల క్రితం రహదారి విషయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో టీడీపీ నేతలు భాస్కర్ నాయుడు, శ్రీపతి నాయుడు, శంకర నాయుడుతో పాటు పదవ తరగతి చదువుతున్న నందకిషోర్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో లేకున్నా చదువుకుంటున్న విద్యార్థిపై కేసు నమోదు ఎలా చేస్తారంటూ తల్లి రాధమ్మ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. కేసు నమోదుపై విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు మండిపడ్డారు. పోలీసులతో టీడీపీ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. 

Updated Date - 2022-04-23T19:28:21+05:30 IST