AP News: ఆర్డీటీ స్టేడియం సమీపంలో రెండు గంటలుగా ట్రాఫిక్ జామ్

ABN , First Publish Date - 2022-07-27T15:40:08+05:30 IST

జిల్లాలోని ఆర్డీటీ స్టేడియం సమీపంలో రెండు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

AP News: ఆర్డీటీ స్టేడియం సమీపంలో రెండు గంటలుగా ట్రాఫిక్ జామ్

అనంతపురం: జిల్లాలోని ఆర్డీటీ స్టేడియం సమీపంలో రెండు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పండమేరు వంక బ్రిడ్జి నుంచి ఆర్డీటీ స్టేడియం వరకు ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. ఎస్కే యూనివర్సిటీ, ధర్మవరం, కదిరి వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ చేసే వారెవ్వరూ లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. రోడ్ల నిర్మాణంలో అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-07-27T15:40:08+05:30 IST