AP News: అనంతలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ABN , First Publish Date - 2022-10-04T16:09:52+05:30 IST

జిల్లాలోని కూడేరులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయ్యింది.

AP News: అనంతలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

అనంతపురం: జిల్లాలోని కూడేరులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయ్యింది. కూడేరు మండలం గొట్కూరు వద్ద తెగిన హై టెన్షన్ వైర్ తెగిపడింది. విద్యుత్ అధికారులకు సమాచారం అందించినా స్పందించలేదు. ఈ క్రమంలో పుట్టినరోజు నాడే విద్యుత్ షాక్‌తో బిటెక్ విద్యార్థి కరుణాకర్ మృత్యువాతపడ్డారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయిందని గొట్కూరు గ్రామస్తులు రాస్తా రోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. యువకుని మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు. 


Updated Date - 2022-10-04T16:09:52+05:30 IST