దూకుడు పెంచిన పోలీసులు...ఉపాధ్యాయ సంఘాల నేతలకు నోటీసులు

ABN , First Publish Date - 2022-02-02T13:29:24+05:30 IST

చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు దూకుడు పెంచారు.

దూకుడు పెంచిన పోలీసులు...ఉపాధ్యాయ సంఘాల నేతలకు నోటీసులు

అనంతపురం: చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు దూకుడు పెంచారు. అర్ధరాత్రి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతల తలుపు తట్టారు. పీఆర్సీకి వ్యతిరేకంగా చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు ఆంక్షలు విధించారు. పలువురు ముఖ్య నేతలకు హౌస్ అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్ కుమార్, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అతావుల్లా మరి కొందరు ముఖ్య నేతలు  గృహనిర్బంధంలో ఉన్నారు. కాగా పోలీసుల తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-02-02T13:29:24+05:30 IST