పరిటాల శ్రీరామ్ చేపట్టిన నిరాహార దీక్షా ప్రాంగణం వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-02-07T19:15:35+05:30 IST
ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దును నిరసిస్తూ టీడీసీ నేత పరిటాల శ్రీరామ్ చేపట్టిన నిరాహార దీక్షా ప్రాంగణం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది.
అనంతపురం: ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దును నిరసిస్తూ టీడీసీ నేత పరిటాల శ్రీరామ్ చేపట్టిన నిరాహార దీక్షా ప్రాంగణం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. దీక్షా ప్రాంగణం వద్దకు పోలీసులు చేరుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నేతలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీక్షకు పోలీసులు సహకరించాలని టీడీపీ నేతలు వేడుకుంటున్నారు.