Anantapur: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

ABN , First Publish Date - 2022-02-17T14:54:39+05:30 IST

జిల్లాలోని పెనుకొండ మండలం మక్కాజిపల్లి తండాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త.

Anantapur: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ మండలం మక్కాజిపల్లి తండాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. భార్య శ్రావణిని భర్త రాజేష్ నాయక్ రోకలిబండతో కొట్టి చంపాడు. రెండో పెళ్లి చేసుకోవాలని దుర్బుద్ధితో హత్య చేసినట్లుగా మృతురాలి బంధువులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-17T14:54:39+05:30 IST