AP: తాడిపత్రిలో ఎస్ఎల్ఎన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-02-25T14:17:32+05:30 IST
జిల్లాలోని తాడిపత్రిలో ఎస్ఎల్ఎన్ థియేటర్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో ఎస్ఎల్ఎన్ థియేటర్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ చిత్రం ఈరోజు థియేటర్ల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా టికెట్లు ఇవ్వకపోవడంపై థియేటర్ ముందు పవన్ అభిమానులు ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన స్పెషల్ పార్టీ పోలీసులు... అభిమానులపై లాఠీ ఝుళిపించారు. పోలీసుల తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... సీఎం డౌన్ డౌన్ అంటూ ఎత్తున నినాదాలు చేపట్టారు.