Anantapur: రైతుపై ఎలుగుబంటి దాడి

ABN , First Publish Date - 2022-03-15T16:52:41+05:30 IST

జిల్లాలోని సెట్టూరు మండలం బొచ్చు పల్లిలో రమేష్ అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది.

Anantapur: రైతుపై ఎలుగుబంటి దాడి

అనంతపురం: జిల్లాలోని సెట్టూరు మండలం బొచ్చు పల్లిలో రమేష్ అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. వేరుశనగ పంట కాపలాకు వెళ్లిన రమేష్‌పై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో రమేష్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమేస్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం  కుటుంబ సభ్యులు అనంతపురం తరలించారు. 

Updated Date - 2022-03-15T16:52:41+05:30 IST