సీఎం జగన్పై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ బీటీ నాయుడు
ABN , First Publish Date - 2021-03-02T16:00:35+05:30 IST
సీఎం జగన్పై ఎమ్మెల్సీ బీటీ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారన్నారు.
అనంతపురం: సీఎం జగన్పై ఎమ్మెల్సీ బీటీ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. ముఖ్యమంత్రి రౌడీ అయితే ఎలా ఉంటుందో నిన్న జరిగిన ఘటన చెపుతుందని వ్యాఖ్యానించారు. 11 కేసుల్లో ముద్దాయిగా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారన్నారు. డబ్బులు, పోలీసులను వాడుకుని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని బీటీ నాయుడు పిలుపునిచ్చారు.