AP: వృద్ధుడి ప్రాణం మీదకు వచ్చిన ఎస్ఐ లాఠీ దెబ్బలు
ABN , First Publish Date - 2022-04-29T17:53:00+05:30 IST
ఎస్ఐ లాఠీ దెబ్బలు ఓ వృద్ధుడి ప్రాణం మీదకు తెచ్చాయి. కుటుంబ కలహాలతో డి.హిరేహాల్ పోలీసులకు వృద్ధుడి కోడలు ఫిర్యాదు చేసింది.
అనంతపురం: ఎస్ఐ లాఠీ దెబ్బలు ఓ వృద్ధుడి ప్రాణం మీదకు తెచ్చాయి. కుటుంబ కలహాలతో డి.హిరేహాల్ పోలీసులకు వృద్ధుడి కోడలు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా వృద్ధుడి కుటుంబీకులను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. సాయంత్రం అవుతోందని మహిళలను ఇంటికి పంపాలని ఎస్ఐని వృద్ధుడు వేడుకున్నాడు. దీంతో కుటుంబీకుల సమక్షంలో వృద్ధుడు హేమంతను ఎస్ఐ రామకృష్ణారెడ్డి చితకబాదాడు. అడ్డుకున్నందుకు ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించారంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ లాఠీ దెబ్బలతో తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుడని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.