AP: ఎద్దుల బండ్లను ఢీకొన్న లారీ...ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-04-30T13:37:44+05:30 IST

జిల్లాలోని పామిడి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

AP: ఎద్దుల బండ్లను ఢీకొన్న లారీ...ఒకరు మృతి

అనంతపురం: జిల్లాలోని పామిడి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మూడు ఎద్దుల బండ్లను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చితంబరి(50)అనే కూలీ మృతి చెందాడు. రెండు ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-30T13:37:44+05:30 IST