Anantapur: లారీ- ఆటో ఢీ...ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-06-14T13:58:03+05:30 IST

జిల్లాలోని యాడికి మండలం వేములపాడు వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

Anantapur: లారీ- ఆటో ఢీ...ఒకరు మృతి

అనంతపురం: జిల్లాలోని యాడికి మండలం వేములపాడు వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ- ఆటో ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి యాడికి మండలం కూర్మాజీపేట గ్రామవాసిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-14T13:58:03+05:30 IST