Anantapurలో మితిమీరుతున్న వైసీపీ నేతల దందా

ABN , First Publish Date - 2021-11-05T16:26:11+05:30 IST

జిల్లాలో వైసీపీ నేతల దందా మితిమీరుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు టపాసుల దుకాణాల వద్ద హల్‌చల్ చేశారు.

Anantapurలో మితిమీరుతున్న వైసీపీ నేతల దందా

అనంతపురం: జిల్లాలో వైసీపీ నేతల దందా మితిమీరుతున్నాయి.  టపాసుల దుకాణాల వద్ద అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు హల్‌చల్ చేశారు. టపాసుల విక్రేతల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే  ముఖ్య అనుచరుడు ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, 30 వ వార్డు కార్పొరేటర్ సైఫుల్లా బేగ్ అనుచరులు గోపాల్, మోహన్, రామయ్య రంగంలోకి దిగారు. ఒక్కొక్క దుకాణానికి రూ.35 వేల చొప్పున బలవంతంగా వసూళ్లు చేశారు. ప్రస్తుతం డబ్బు వసూళ్లు చేస్తున్న నేతల వీడియోలు  సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుల సరికొత్త దందాపై టపాసుల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేతోనే అనుచరులు ఫోన్లో బేరసారాలు నడిపారు. అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు హుకుం జారీ చేశారు. కళ్లెదుటే టపాసుల వ్యాపారులను బెదిరిస్తున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరించిన పోలీసుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-11-05T16:26:11+05:30 IST